హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. చిత్రంలోని పాట ఆస్కార్కు నామినేట్ కావడం తెలుగుచలనచిత్రానికి దక్కిన గౌరవమన్నారు.
22 సంవత్సరాల తర్వాత ఆర్ఆర్ఆర్ తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణమన్నారు. ఇప్పటికే అనేక జాతీయ అవార్డులు అందుకున్న చిత్ర దర్శకుడు రాజమౌళి, నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్, చిత్ర యూనిట్ సభ్యులకు అభినందలు తెలిపారు. భారత్ నుంచి వివిధ భాషలకు చెందిన 10 చిత్రాలు పోటీ పడగా తెలుగు చిత్రం ఎంపిక కావడం తెలుగుచిత్రానికి లభించిన గుర్తింపు, గౌరవమన్నారు.