Rashmika Mandanna | ‘ఈ రోజు మేం మృత్యువు నుంచి తప్పించుకున్నాం’ అంటూ హీరోయిన్ శ్రద్ధాదాస్తో కలిసి దిగిన ఓ ఫొటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది నేషనల్ క్రష్ రష్మిక. ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులందరూ కంగారు పడిపోయారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ముంబయ్ నుంచి హైదరాబాద్ విమానం ప్రయాణం చేసింది ఈ అందాలభామ. ఈ ప్రయాణంలోనే పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.
ముంబయి నుంచి టేకాఫ్ అయిన 30 నిమిషాలకే రష్మిక ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో పైలెట్ చాకచక్యంగా విమానాన్ని ముంబయ్లోనే అత్యవసర ల్యాండింగ్ చేశాడు. దీంతో ప్రయాణంలోని వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ విమానంలో రష్మికతోపాటు మరో కథానాయిక శ్రద్ధాదాస్ కూడా ప్రయాణిస్తుండటం విశేషం. ఈ భయానక అనుభవాన్ని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది రష్మిక. ఇక రష్మిక కెరీర్ విషయానికొస్తే.. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సినిమాలతో ఆమె బిజీబిజీ. ‘పుష్ప2’, రెయిన్బో, ది గర్ల్ఫ్రెండ్, చావా ప్రస్తుతం ఆమె చేతిలోవున్న సినిమాలు.