Rashmika Mandanna | ఛలో, గీతగోవిందం సినిమాలతో తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ సోయగం రష్మికమందన్నా (Rashmika Mandanna). పుష్ప.. ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్తో నేషనల్ క్రష్గా మారిపోయిన ఈ భామ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా సినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటూ వెళ్తోన్న ఈ భామ ఖాతాలో అరుదైన మైల్ స్టోన్ చేరిపోయింది.
రష్మిక మందన్నా ఇన్ స్ట్రాగ్రామ్ (Instagram followers)ఫాలోవర్ల సంఖ్య 38 మిలియన్లు దాటింది. దీంతో ఈ మైల్ స్టోన్ అందుకున్న వారి జాబితాలో వన్ ఆఫ్ ది స్టార్ సెలబ్రిటీగా నిలిచింది. రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్తోపాటు ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న రెయిన్ బోలో నటిస్తోంది రష్మిక.
రెయిన్ బో సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుంది. వీటితోపాటు బాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ యానిమల్లో నటిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు భీష్మ తర్వాత టాలీవుడ్ యువ హీరో నితిన్, యువ దర్శకుడు వెంకీకుడుముల కాంబినేషన్లో రెండోసారి వస్తోన్న VNRTrio (వర్కింగ్ టైటిల్) లో కూడా నటిస్తోంది రష్మిక.