సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య,రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రదారులుగా రూపొందుతున్న చిత్రం ‘నాతో నేను’. శాంతి కుమార్ తూర్లపాటి దర్శకుడు. ప్రశాంత్ టంగుటూరి నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్ను ఇటీవల ప్రముఖ నిర్మాత ‘దిల్’రాజు విడుదల చేశారు. ఈ సంద ర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. పూర్తి వినోదాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆదిత్య ఓం పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నాం. ’ అన్నారు.