సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాళి రాజ్పుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘నాతో నేను’. శాంతి కుమార్ తూర్లపాటి దర్శకుడు. ప్రశాంత్ టంగుటూరి నిర్మాత. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రసుత్తం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్నది.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓసిని వయ్యారి రామచిలుక’ అనే లిరికల్ వీడియోను కథానాయకుడు ఆది సాయికుమార్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అందరికి నచ్చే అంశాలతో రూపొందిస్తున్న ఫీల్గుడ్ ఎంటర్టైనర్ ఇది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య కశ్యప్.