సాయికుమార్, శ్రీనివాస సాయి, ఆదిత్యా ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రదారులుగా రూపొందుతున్న చిత్రం ‘నాతోనేను’. శాంతి కుమార్ తూర్లపాటి దర్శకుడు. ప్రశాంత్ టంగుటూరి నిర్మాత. ఈ చిత్రంలోని రెట్రో మెలోడి సాంగ్ను ఇటీవల హీరో శ్రీకాంత్ విడుదల చేశాడు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ పాటను చూసిన వారికి 1980 కాలంలో వున్నామా అనిపించే విధంగా విజువల్స్ వుంటాయి. మంచి కథతో తొలి ప్రయత్నం చేశాను. తప్పకుండా చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ వుంటుందనే నమ్మకం వుంది’ అన్నారు.