Malli Pelli Movie Promotions | సినిమా రంగంలోని నటీనటులు వాళ్ల వ్యక్తిగత విషయాలు బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే వాళ్ల గురించి కిటుక్కు మని శబ్దం వచ్చిన అది సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. కానీ నరేష్, పవిత్ర లోకేష్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తమ పర్సనల్ లైఫ్లో జరిగే విషయాలను వీరు పబ్లిక్ బయటపెట్టేస్తున్నారు. కాగా వీరిద్దరూ కలిసి నటించిన మళ్లీ పెళ్లి సినిమా కోసం ఈ జంట తెగ ప్రమోషన్లు చేస్తుంది. గతవారం విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రివ్యులను తెచ్చుకుని ఫ్లాప్ దిశగా సాగుతుంది. రిలీజ్కు ముందు ఓ రేంజ్లో ప్రమోషన్లు జరిపినా.. జనాలు మాత్రం వీళ్ల సినిమాను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ఇక ఇదిలా ఉంటే ఈ జంట ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వూలు ఇస్తున్నారు. కాగా తాజాగా నరేష్.. పవిత్ర లోకేశ్ తో పెళ్లి, పిల్లల గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవిత్రా లోకేశ్ పిల్లల్ని కనడంలో ఎలాంటి తప్పు లేదనే విధంగా నరేష్ మాట్లాడుతూ.. తాను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్గా ఉన్నామని, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తాను ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. తన దృష్టిలో బ్లడ్ రిలేషన్ షిప్తో పోల్చి చూస్తే ఎమోషనల్ రిలేషన్ షిప్ అనేది ముఖ్యమని నరేష్ వెల్లడించారు. విజయనిర్మలకు, పవిత్ర లోకేశ్కు పోలికలు ఉన్నాయని ఆయన తెలిపారు. తన తల్లి కళ్లు, పవిత్ర కళ్లు ఒకేలా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతామని నరేష్ అన్నాడు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే పవిత్ర, నరేష్ పిల్లల్ని కనాలని భావిస్తున్నారని అర్థమవుతుంది. ఇక తమ పర్సనల్ లైఫ్నే ఆధారంగా చేసుకుని మళ్లీ పెళ్లి సినిమాను రూపొందించారు. ఎమ్.ఎస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తొలిరోజు రూ.50 లక్షల వరకు గ్రాస్ను సాధించిన ఈ సినిమా రెండో రోజు నుంచి సైలెంట్ అయిపోయింది.