కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వంతో పాటు సెలబ్రిటీలు బాధ్యాయుతంగా వ్యవహరిస్తున్నారు.కొందరు సాయాలు చేస్తుంటే మరి కొందరు తమ సోషల్ మీడియా ద్వారా ప్రజలలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా నేచురల్ స్టార్ నాని దారే లేదా పేరుతో ఓ వీడియో రూపొందించగా, ఇందులో ఫ్రంట్ లైన్ వర్కర్స్ పడుతున్న ఇబ్బందులని తెలియజేశాడు. ఇక తాజాగా కరోనా పోరాటం విషయంలో డాక్టర్తో చర్చ జరిపారు.
థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని జోరుగా ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో పిల్లల తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు.వారి టెన్షన్ పోగొట్టేందుకు నాని డాక్టర్ శివరంజని సంతోష్తో ఓ చర్చ జరిపారు. ఇందులో కరోనా బారి నుంచి పిల్లల్నిఎలా రక్షించుకోవాలనే విషయంపై శివరంజని తన సలహా సూచనలు తెలియజేశారు.
థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపిస్తుందని మొదట ప్రచారం జరిగింది. కాని తర్వాత జరిపిన పరిశోధనలలో ‘వైరస్ ఇప్పటిలాగే ఉంటే గతంలో ఉన్న ప్రభావం మాత్రమే ఉండే అవకాశం ఉందని తేలింది. ఇప్పుడు కరోనా వచ్చిన వందలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఆసుపత్రిలో చేరుతున్నారు. కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు. మహమ్మారి బారిన పడకుండా టీకాలు తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్నాంకదా అని అజాగ్రత్త ఉండకూడదు.
మాస్క్ ధరిచండంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి. ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్క్కు బదులుగా వారిని ఇంట్లోనే ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు నోట్లో థర్మామీటర్ పెట్టవద్దని వైద్యులను కోరాలి. బలమైన ఆహారం తీసుకోవాలి’’ అని శివరంజని స్పష్టం చేశారు.