sai dharam tej accident | మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అభిమానులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇదిలాఉంటే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఓవర్ స్పీడ్ కారణంగా.. అలాగే రోడ్డుపై ఇసుక పేరుకుపోవడంతో బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు అయితే గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ బైక్ పై ఓవర్ స్పీడ్ ఛలాన్ ఉంది అంటూ ఇదివరకే పోలీసులు తెలిపారు. సాయి ధరమ్ తేజ్కు యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందట బైక్పై ఓవర్స్పీడ్తో వెళ్తున్నాడని సాయి ధరమ్ తేజ్కు ఫైన్ వేశారు. ఇప్పుడు ఈ బైక్పై ఉన్న ఛలానాను ఎవరో చెల్లించారు. అయితే అది ఎవరు అని ఆరా తీయగా.. నందమూరి అభిమాని ఒకరు ఈ ఫైన్ చెల్లించినట్లు తెలిసింది.
నిజానికి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన బైక్.. ఆయన పేరు మీద లేదు. అనిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి తేజూ ఈ బైక్ కొనుగోలు చేశాడు. అయితే ప్రమాదం తర్వాత.. సాయి ధరమ్ తేజ్ నడిపిన బైక్పై పెండింగ్ ఛలాన్ ఉందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్.. ఈ ఫైన్ను చెల్లించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ బైక్పై ఉన్న ఫైన్ను ఎవరో కట్టేశారని పోలీసులు కూడా తెలిపారు. ఏదేమైనా ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. వాళ్ల ప్రార్థనలకు తగ్గట్టే అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తాజాగా ఆయనకు చేసిన కాలర్ బోన్ సర్జరీ కూడా సక్సెస్ అయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
సాయి ధరమ్ తేజ్ సేఫ్.. ఇదిగో చిరంజీవి ఇచ్చిన సాక్ష్యం..
Babu Mohan : స్పోర్ట్స్ బైక్ విచ్చలవిడిగా నడపొద్దు.. ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్
సహజనటి జయసుధకు ఏమైంది.. ఎందుకు ఇలా మారిపోయింది..?