బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘జై బాలయ్య..’ అనే లిరికల్ పాటను శుక్రవారం విడుదల చేశారు.
ఈ పాటను థమన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా కరీముల్లా పాడారు. కథానాయకుడి గొప్పదనం తెలిపేలా ఈ పాట ఆకట్టుకుంటుందని, ఊరి కోసం, తన వారి కోసం అతను ఎలా ముందడుగు వేశాడనేది పాటలో చూపించామని చిత్రబృందం చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇతర కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రిషి పంజాబీ, ఎడిటర్ : నవీన్ నూలి.