అగ్ర హీరో బాలకృష్ణ గత కొన్నేళ్లుగా వరుస బ్లాక్బస్టర్ హిట్స్తో జోష్ మీదున్నారు. సినిమాల మధ్య ఏమాత్రం విరామం లేకుండా వెంటవెంటనే ప్రాజెక్ట్లను పట్టాలెక్కిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 111వ చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకుడు. నయనతార కథానాయికగా నటిస్తున్నది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు బి.గోపాల్ క్లాప్నివ్వగా, బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విఛాన్ చేశారు. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారని, అద్భుతమైన విజువల్స్తో పాటు పోరాట ఘట్టాలు అబ్బురపరుస్తాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.