Bakakrishna | థియేటర్కు వచ్చి సినిమా చూస్తే మజాగా ఉంటుందని సినీ హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించాడు. ఆయన హీరోగా, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా గత నెల రెండో తేదీన విడుదలైన అఖండ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం ఆయన సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో సినిమా చూశారు.
సినిమా ప్రదర్శన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. సమరసింహారెడ్డి తర్వాత మళ్లీ ఇప్పుడు సుదర్శన్ థియేటర్కు వచ్చానని చెప్పారు. అఖండ సినిమా విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమాను విజయవంతం చేసిన అభిమానుకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లక్షల మంది అభిమానులను సంపాదించుకోవడం గర్వంగా ఉందన్నారు.
ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో ‘అఖండ’ చూస్తే అర్థమవుతుందని బాలకృష్ణ చెప్పారు. హీరోయిన్గా ప్రగ్యా జైశ్వాల్ అద్భుతంగా నటించారన్నారు. సినిమా విడుదలకు ముందే ‘అఖండ’ గురించి మాట్లాడుకున్నారని. సినిమాను థియేటర్కు వచ్చి చూస్తేనే మజా అని అన్నారు. శుక్రవారం నుంచి డిస్నీ+హాట్స్టార్ వేదికగా ‘అఖండ’ స్ట్రీమింగ్ కానుందని, అక్కడ కూడా సినిమాను ఆదరించాలని అన్నారు.