Nandamuri Balakrishna | సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన బాలకృష్ణ ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో రెండు రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని బాలయ్య ప్రకటించారు. బాలకృష్ణకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.