బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష యం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమా టైటిల్ ఏమిటన్నది చాలా రోజులుగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. సోషల్మీడియాలో ‘అన్నగారు’ ‘పెద్దన్నయ్య’ అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతూ చిత్ర నిర్మాతలు ఈ నెల 21న టైటిల్ను ప్రకటించబోతున్నారు. బాలకృష్ణ ఇమేజ్తో పాటు కథకు సరిపో యేలా టైటిల్ను నిర్ణయించారని తెలిసింది. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్లుక్, టీజర్కు మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, సంగీతం: తమన్, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.