Nandamuri Balakrishna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేత టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఇక బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.