హైదరాబాద్ : నటి నమ్రతా శిరోద్కర్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వ్యాయామం చేయడం ప్రారంభించింది. బ్యాక్ గ్రౌండ్లో జిమ్ పరికరాలతో ఉన్న ఫోటోను ఆమె ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా భద్రతా, జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. వ్యాయామం సవాలుగా ఉందంది. ముఖ్యంగా సుదీర్ఘ విరామం తర్వాత అని పేర్కొంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కొవిడ్ భారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. ఒకవేళ కొవిడ్కు గురైనా త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుందన్నారు. ఫిట్గా ఉండండి, సురక్షితంగా ఉండండని నమ్రతా పేర్కొంది. మహేష్ బాబు వ్యక్తిగత స్టైలిస్ట్ కొవిడ్ పాజిటివ్ భారిన పడటంతో మహేశ్తో పాటు కుటుంబ సభ్యులు సెల్ఫ్ ఐసోలేషన్ అయినట్లుగా సమాచారం.