ఒకరు టాలీవుడ్ సూపర్ స్టార్..మరొకరు బాలీవుడ్ సూపర్ స్టార్..ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ విషయంలో ఇద్దరూ ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోరనే చెప్పాలి. ఇంతకీ ఆ ఇద్దరెవరనుకుంటున్నారా..? మహేశ్ బాబు (Mahesh Babu), షారుక్ ఖాన్ (Shah Rukh Khan). ఈ స్టార్ హీరోలిద్దరి కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. బాద్ షా నేషనల్ స్టార్ కాబట్టి పలువురు తెలుగు హీరోలతో సాధారణంగా మంచి స్నేహబంధం ఉంటుంది.
ఇక మహేశ్ కూడా బాలీవుడ్లోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల సతీమణులు కూడా తీరిక సమయం దొరికితే ఒక్క చోట కలవడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా అలాంటి అరుదైన సందర్భం మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar)కు, షారుక్ ఖాన్ సతీమణి గౌరీఖాన్ (Gauri Khan)కు వచ్చింది. ఈ ఇద్దరు ఎవరూ ఊహించని విధంగా లంఛ్ డేట్ (lunch date) ప్లాన్ చేశారు.
ఇద్దరూ మధుర జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. గౌరీఖాన్తో లంఛ్ డేట్ వెళ్లిన సమయంలో దిగిన ఫొటోను నమ్రతా ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. గౌరీఖాన్ ఇంట్లో ఊహించని సరదా భోజనం..గౌరీఖాన్ హౌస్లో..అక్షరాలాగా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం..సమయం నిలకడగా ఉంది..పూర్తి లంచ్ ఫ్లాష్బ్యాక్లు, గొప్ప జ్ఞాపకాలు, చాలా నవ్వులు మిగిల్చింది..అంటూ తన హ్యాపీనెస్ను షేర్ చేసుకుంది నమ్రతా. స్టార్ హీరోల సతీమణుల లంఛ్ డేట్ ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.