‘మా’ ఎన్నికల (Maa Elections)ప్రక్రియ ముగిసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రకాశ్రాజ్ ఓడిపోయిన తర్వాత నాగబాబు (Nagendra Babu) మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘మా’ సభ్యత్వానికి నాగబాబు రాజీనామా చేస్తూ.. తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రకాశ్రాజ్కు తానెప్పుడూ అండగా ఉంటానని నాగబాబు లేఖలో పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు మాలో చీలికకు కారణమయ్యాయి. ప్రాంతీయవాదం, సంకుచిత భావాలు కలిగిన వారు గెలిచారని నాగబాబు అన్నారు. మా భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తుంది. ఇలాంటి అసోసియేషన్ లో కొనసాగకూడదనే రాజీనామా చేశానని లేఖలో తెలిపారు నాగబాబు.
జరిగిన పరిణామాలకు హర్ట్ అయ్యి నాగబాబు రాజీనామా చేశారని మా మాజీ అధ్యక్షుడు నరేశ్ (Naresh) అన్నారు. అందర్నీ కలుపుకొని పోవాలి. జయసుధను పెడదామన్నాను. నాగబాబు పట్టించుకోలేదు. నిన్న చిరంజీవి ఎవరి గురించి మాట్లాడారో ఆయనే చెప్పాలి. అందర్నీ కలుస్తాం. కలిసి పనిచేస్తాం. మా ఒక సేవా సంస్థ అని నరేశ్ స్పష్టం చేశారు. దాసరి లోటు మోహన్బాబు భర్తీ చేస్తారని నరేశ్ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ.. ఆ స్థానం తనకొద్దని, దాసరి లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని, తీర్చలేరని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Mohan Babu | నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు: మోహన్ బాబు
Manchu Vishnu | నాగబాబు రాజీనామా ఆమోదించం: మంచు విష్ణు
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్