గత ఏడాది బంగార్రాజు, ది ఘోష్ట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు అగ్ర నటుడు నాగార్జున. ఆయన తదుపరి చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఇటీవలే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, అజయ్భూపతి చెప్పిన కథలోని కొత్తదనం నచ్చడంతో నాగార్జున వెంటనే అంగీకారం తెలిపారని అంటున్నారు.
ప్రస్తుతం దర్శకుడు అజయ్భూపతి ‘మంగళవారం’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇది పూర్తయిన వెంటనే నాగార్జునతో చేయబోయే చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.