‘తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి ఆలయంలో ఓ నేలమాళిగ ఎందుకు తెరవలేదు? అనే విషయంపై చాలా చర్చలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన అంశం అది. నిజంగా ఆ గది తెరిస్తే అందులో ఏముంటుందో ఊహిస్తూ ఓ ఫిక్షనల్ స్టోరీ రాస్తే బావుంటుందనిపించింది.
ఆ ఆలోచన నుంచే ‘నాగబంధం’ కథ పుట్టింది ’ అని తెలిపారు దర్శకుడు అభిషేక్ నామా. ఆయన దర్శకత్వంలో రూపొందిన అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. విరాట్కర్ణ కథానాయకుడు, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలు. కిశోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో అభిషేక్ నామా విలేకరులతో మాట్లాడారు.