మజిలీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన నాగ చైతన్య రీసెంట్గా ‘లవ్ స్టోరీ’ అనే చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం థ్యాంక్యూ, బంగార్రాజు, లాల్ సింగ్ చద్దా చిత్రాలతో పాటు ఓ వెబ్ సిరీస్తోను బిజీగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. రాశి ఖన్నా, అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.
దిల్ రాజు, ఆయన బృందం థ్యాంక్యూ థియేట్రికల్ విడుదలను ఓటిటి ప్లాట్ఫామ్ ద్వారా విడుదల చేయడానికి ఆసక్తిగా ఉన్నారని, ప్రస్తుతం సినిమా ఓటిటి రిలీజ్ కు సంబంధించి ఓ ప్రముఖ ఓటిటి సంస్థతో డీల్ పూర్తయ్యిందని తెగ ప్రచారం నడిచింది. త్వరలో “థాంక్యూ” సినిమా విడుదలపై అధికారిక ప్రకటన వెలువడనుందని అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చిత్ర బృందం స్పందించింది. సమయం వచ్చినప్పుడు చిత్రాన్ని బిగ్ స్క్రీన్లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, మూవీ థియేటర్లో మంచి వినోదం పంచుతుందని అన్నారు.
నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందనున్న దీని ద్వారానే ఈ టాలెంటెడ్ హీరో ఓటీటీ వరల్డ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సిరీస్లో నాగ చైతన్య క్రూరమైన విలన్ పాత్రను చేస్తున్నాడట. ఒకరకంగా ఇది సైకోను పోలి ఉంటుందని అంటున్నారు. హీరోగా సత్తా చాటుతోన్న అతడు.. ఇప్పుడీ ప్రయోగం చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు.