అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించింది. డిఫరెంట్ కథాంశంతో రూపొందిన లవ్ స్టోరీ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది. విడుదలైన అన్ని సెంటర్లలో క్లాస్, మాస్ ఆడియన్స్ మనసు దోచుకుంటూ హౌస్ ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది.
సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఈ మూవీని ఆకాశానికి ఎత్తారు. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి, ఆమీర్ ఖాన్ వంటి బడా స్టార్స్ హాజరు కావడం, సారంగదరియా అనే పాట ఎంతగానో ఆకట్టుకోవడం, సినిమాకి పోటీగా మరో సినిమా లేకపోవడం చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడంలో భాగం అయ్యాయి. ఈ విజయంతో ఇటు నటీనటులతో పాటు అటు సాంకేతిక వర్గం ఫుల్ ఖుషీ అవుతోంది.
ముఖ్యంగా చాలా రోజుల తర్వాత తనకు ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసిన నాగ చైతన్య..తన సోషల్ మీడియాలో మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ చిత్ర యూనిట్ అంతా కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. లైఫ్ టైం మెమొరీస్ని ఇచ్చిన ఆడియెన్స్కి ‘లవ్ స్టోరీ’ టీమ్ ధన్యవాదాలు తెలుపుతుంది” అని చైతూ కామెంట్ చేశారు. ఇటీవల లవ్ స్టోరీ సక్సెస్ మీట్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.