మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి ఇంకా రాజుకుంటూనే ఉంది. రీసెంట్గా బాలయ్య వ్యాఖ్యలు, అంతకముందు మురళీ మోహన్ ఏకగ్రీం అనే మాటలపై నాగబాబు తాజాగా స్పందించాడు. రాష్ట్రం విడిపోవడం వల్ల రకరకాల కారణాలతో అసోసియేషన్ బిల్డింగ్ కట్టడం కన్నా వెల్ఫేర్ ముఖ్యమనే ఆలోచనతో భూమి సేకరణ, భవన నిర్మాణ పనులు మూలన పడ్డాయి. దాంతో ఫిలిం ఛాంబర్లోనే ఓ మూలకు మా కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మా భవన నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని నాగబాబు అన్నారు.
ప్రకాశ్ రాజ్కి మంచి విజన్ ఉంది. అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలతో మంచి సంబంధం ఉంది. బిజీ సమయంలోను తన సమయాన్ని మాకు కేటాయిస్తామని అన్నారు. ‘తెలుగు పరిశ్రమ నాకెంతో ఇచ్చింది. నేను ఏదో ఒకటి పరిశ్రమ కోసం చేయాలనుకుంటున్నా. అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఓ యాక్షన్ ప్లాన్తో ప్రకాశ్రాజ్ ఉన్నారు. అందుకే నా మద్దతు తెలియజేస్తున్నాను అని నాగబాబు స్పష్టం చేశారు.
ప్రకాశ్ రాజ్ గెలిచినా, విష్ణు గెలిచినా అందరం కలిసే పని చేస్తాం. సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వ్యక్తి ఓ పని చేయడానికి వస్తే ఎదుటి వ్యక్తి ఓ అడుగు వెనక్కి వేయడంలో తప్పులేదని నా అభిప్రాయం. మంచు విష్ణు కూడా ఏదో చేయాలనే కదా వస్తున్నారు. కాబట్టి పోటీ జరిగితేనే బావుంటుంది. ‘బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం బరిస్తాను’ అని విష్ణు అనడం మంచిదే. బిల్డింగ్ కట్టేందుకు స్థలం ఎలా ేసకరిస్తారో విష్ణు చెప్పాలి. ఎలక్షన్లకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఇప్పుడు జరిగేది అంతా టీ కప్పులో తుపాను లాంటిదని నాగబాబు పేర్కొన్నారు.