ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నభా నటేశ్ (Nabha Natesh). 2021లో చివరిసారిగా నితిన్తో కలిసి మ్యాస్ట్రో (Maestro) సినిమాలో మెరిసింది. ఆ తర్వాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అంతేకాదు సోషల్ మీడియాలో అందరికీ టచ్లో ఉండే ఈ భామ చాలా కాలంగా అంతగా కనిపించడం కూడా లేదు. అయితే ఇంతకీ ఏమైంది.. నభానటేశ్ ఎందుకు కనిపించడం లేదని తెగ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు.
అయితే చాలా రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ పోస్ట్తో నెటిజన్లు, ఫాలోవర్ల ముందుకొచ్చింది నభా నటేశ్. తనకు ప్రమాదం జరిగిందని షాకింగ్ న్యూస్ షేర్ చేసింది. గత సంవత్సరం చాలా కష్టంగా గడిచింది. నాకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నా ఎడమ భుజం భాగంలో ఉన్న ఎముకలు విరిగాయి. ఈ నేపథ్యంలో పలు సార్లు సంక్షిష్టమైన సర్జరీలు చేశారు. నేను ఊహించని భౌతిక, మానసిక వేదనను అనుభవించా. గాయాల నుంచి కోలుకునేందుకు నాకెంతో ఇష్టమైన సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నా.
మీ అందరి మద్దతు ఇచ్చిన ధైర్యం నేను ఈ కష్టం నుంచి కోలుకునేందుకు సహాయపడింది. నేనిపుడు పూర్తిగా కోలుకున్నానని అందరితో చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంత బలంగా కమ్బ్యాక్ ఎంట్రీ ఇస్తున్నా. హలో 2023.. మీ అందరి కోసం నేను సిద్ధంగా ఉన్నానని సందేశంలో రాసుకొచ్చింది నభా నటేశ్.
నభా నటేశ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..