Rangamarthanda Movie | పద్దెనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘గులాబి’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు కృష్ణవంశీ. తొలిసినిమాకే తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. విషయం ఉన్న దర్శకుడు అనే పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఏడాది నాగార్జునతో నిన్నే పెళ్లాడుతా తెరకెక్కించి సౌత్లో సెన్సేషన్ అయ్యాడు. రెండో సినిమాకే నేషనల్ అవార్డు అందుకుని హాట్ టాపిక్ అయ్యాడు. ఆ తర్వాత సింధూరం, అంత:పురం, మురారి, ఖడ్గం వంటి బ్లాక్బస్టర్ హిట్లతో టాలీవుడ్లో తిరుగులేని దర్శకుడిగా మారాడు. కెరీర్ మొదట్లో వరుస హిట్లతో జోరు మీదున్న కృష్ణవంశీ ఆ తర్వాత కాస్త డల్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పలకరించే సరికి ఫామ్ కోల్పోయాడు.
నిజానికి గత పదేళ్లుగా కృష్ణవంశీకి హిట్టే లేదు. చివరగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమా నక్షత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. దాంతో ఆరేళ్లు గ్యాప్ తీసుకొని రంగమర్తాండ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మరాఠీలో సూపర్ హిట్టయిన నట సామ్రాట్కు రీమేక్గా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. ఈ సినిమా మార్చి22న విడుదల కాబోతుంది.
కాగా ఈ సినిమా హక్కులను మైత్రీ సంస్థ దక్కించుకుంది. సంక్రాంతికి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన మైత్రీ.. వరుసగా సినిమాలను విడుదల చేస్తుంది. ఇక రంగమార్తాండ సినిమాకు మైత్రీ తోడవడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగే చాన్స్ ఉంది. ఈ సినిమాను మైత్రీ పెద్ద ఎత్తులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. బ్రహ్మనందం, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను హౌజ్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైనమెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇళయరాజా స్వరాలు సమకూర్చుతున్నాడు.