Allu Arjun Pushpa 2 | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప ది రూల్’. పుష్ప సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం నేడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు పుష్ప 2 టీమ్ భారీ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసింది. ఇక ఈ ప్రెస్ మీట్ ఇండియాలోని పుష్ప విడుదలయ్యే అన్ని రాష్ట్రాల నుంచి నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ హాజరయ్యారు.
అయితే ఈ వేడుకలో పుష్ప నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ మాట్లాడుతూ.. పుష్ప 2 అదిరిపోతుందని తెలిపాడు. ముందుగా ఈ చిత్రంలో నటించిన వారందరికి ధన్యవాదాలు. అల్లు అర్జున్ గత 2 ఏండ్ల నుంచి పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంతో కష్టపడి ఈ సినిమాను చేశాడు. అల్లు అర్జున్ కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకులు కోరుకుంటున్నట్లు ఒకరోజు ముందుగానే ఈ సినిమాను తీసుకువస్తున్నాం అంటూ రవిశంకర్ చెప్పుకోచ్చాడు.