చిరంజీవి కథానాయకుడిగా మోహన్రాజా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ చిత్రం ‘లూసిఫర్’ ఆధారంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించబోతున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టినట్లు సంగీత దర్శకుడు తమన్ సోమవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దర్శకుడు మోహన్రాజాతో కలిసి దిగిన ఓ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో చిరంజీవి సరికొత్త లుక్లో కనిపించనున్నారని చెబుతున్నారు. మలయాళ మాతృకలోని మూలకథను తీసుకొని చిరంజీవి ఇమేజ్కు తగినట్లుగా తెలుగు రీమేక్లో పలు మార్పులు చేసినట్లు సమాచారం.