తెలుగు చిత్రసీమలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే మహేష్బాబు, మంచు మనోజ్తో పాటు పలువురు స్టార్స్ కరోనా బారిన పడ్డారు. తాజాగా సంగీతదర్శకుడు తమన్కు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ‘డబుల్ వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. అయినా కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. స్వీయనిర్భంధంలో ఉంటూ వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నా’ అని తమన్ తెలిపారు.