RP Patnaik | ఆర్పీ పట్నాయక్.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు ఒక సంచలనం. సినిమా ఏదైనా కూడా ఈయన పేరు కచ్చితంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆర్పీ పట్నాయక్ కేరాఫ్ అడ్రస్. ఇక తేజ సినిమా ప్రకటించాడు అంటే ఆ పోస్టర్పై కచ్చితంగా ఆర్పీ పట్నాయక్ పేరు ఉండాల్సిందే. మిలీనియం మొదట్లో ఆర్పీ పాటలకు అదిరిపోయే క్రేజ్ ఉండేది. ఈయన పనితీరు మెచ్చి మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంద్ర సినిమాలో ఒక పాటకు ప్రత్యేకంగా సంగీతం ఇవ్వమని కోరాడు. అదే సమయంలో వెంకటేశ్, నాగార్జున, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా సంగీతం అందించాడు ఆర్పీ పట్నాయక్.
ఇక ఉదయ్ కిరణ్ సినిమాలకు అయితే ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు అందించాడు. అలాంటి ఆర్పీ పట్నాయక్ ఉన్నట్టుండి కనుమరుగైపోయాడు. కొన్ని ఏళ్లుగా ఆయన నుంచి సినిమాలు రావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే సంగీత దర్శకత్వం నుంచి రిటైర్ అయిపోయారు ఆర్పీ. దానికి కారణాలు ఏంటి అంటే ఓపెన్ కావడం లేదు ఈ సీనియర్ సంగీత దర్శకుడు. అయితే ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం మహేశ్ బాబు సినిమాకు పాటలు పాడి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పాడు. మహేశ్కు పాటలు పాడటం వల్లే తన కెరీర్ సగం పాడైపోయిందని చెప్పుకొచ్చాడు ఆర్పీ పట్నాయక్.
అప్పట్లో తేజ దర్శకత్వంలో మహేశ్ బాబు ( Mahesh babu ) హీరోగా నటించిన నిజం సినిమాలో ఏకంగా ఏడు పాటలు పాడాడు పట్నాయక్. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత విమర్శలు కూడా అలాగే వచ్చాయి. సింగర్స్ అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అన్ని పాటలు తనే పాడాడు.. అస్సలు సూట్ కాలేదు అంటూ మహేశ్ బాబు అభిమానులు కూడా విమర్శించారు. ఇదే విషయం ఇప్పుడు ఆర్పీపట్నాయక్ కూడా ఒప్పుకున్నాడు. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోకి తన వాయిస్ సూట్ కాలేదని.. తర్వాత ఈ విషయంలో చాలా రిగ్రెట్ ఫీలయ్యాను అంటున్నాడు ఈయన. నిజం సినిమా తర్వాత మీరు పాటలు పాడటం మానేయండి అంటూ చాలామంది తనకు వార్నింగ్ ఇచ్చారని.. ఆ తర్వాత సినిమాల్లో పాటలు కూడా ఎక్కువగా పాడలేదని గుర్తు చేశాడు ఆర్పీ పట్నాయక్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో రానాకు అన్యాయం చేస్తున్నారా..?
మరో క్రేజీ ఆఫర్ అందుకున్న బిగ్ బాస్ బ్యూటీ..!
క్లీవేజ్ షోతో అదరగొట్టిన జాన్వీ కపూర్.. పిక్స్ వైరల్
కూతురితో కలిసి సురేఖా వాణి రచ్చ మాములుగా లేదు-వీడియో
Bigg boss 5 |యాంకర్ రవి బిగ్ బాస్ ఎంట్రీపై నోరు జారిన లాస్య