గత ఏడాది ఎంతో మంది సెలబ్రిటీలను పొట్టన పెట్టుకున్న ఈ కరోనా మహమ్మారి ఈ ఏడాది కూడా సినీ రంగానికి చెందిన ప్రముఖులని మృత్యువాతకు గురి చేస్తుంది. తాజగా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్(66) కరోనాతో కన్నుమూశారు.దిగ్గజ సంగీత దర్శకుల ద్వయంలో ఒకరైన శ్రావణ్ రాథోడ్కు (నదీమ్- శ్రావణ్ ) కొద్ది రోజుల క్రితం కరోనా సోకగా, ఆయనకు ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ వచ్చారు.అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉందని శ్రావణ్ కుమారుడు, మ్యూజిక్ కంపోజర్ సంజీవ్ రాథోడ్ ముందు నుండి చెబుతూనే ఉన్నారు .
దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వైరస్ కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని ఈ క్రమంలోనే ఆయన మృత్యువాత పడ్డాడని తెలుస్తుంది. శ్రావణ్ మృతిని మ్యూజిక్ కంపోజర్ నదీమ్ సైఫీ కన్ఫాం చేశారు. శ్రావణ్ మృతిని జీర్ణించుకోలేని బాలీవుడ్ ఆయన మృతికి సంతాపం తెలియజేసింది. కాగా ఆషిఖీ, సాజన్, పర్దే, రాజా హిందుస్తానీ సూపర్ హిట్ పాటలతో నదీమ్-శ్రవణ్ జోడీ సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. 2000 ల మధ్య కాలంలో విడిపోయిన వీరిద్దరూ తిరిగి 2009లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన డు నాట్ డిస్టర్బ్ మూవీకి కలిసి పని చేశారు.