హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాశ్ బుధవారం పాల్గొన్నారు. ఆర్జే సునీత విసిరిన చాలెంజ్ను స్వీకరించి జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్క్లో సతీమణి అనూజతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
పెళ్లయిన తర్వాత మొదటిసారిగా మొక్కలు నాటుతున్నామని, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని.. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం మరిచిపోలేని అనుభూతి అన్నారు. పెరుగుతున్న పొల్యూషన్ కంట్రోల్ చేయాలన్నా.. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం గెటప్ శ్రీను, కెవ్వు కార్తీక్, కిరాక్ ఆర్పీ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.