ముఖేష్ గౌడ, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న ‘గీతా శంకరం’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. రుద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ఎమ్జీ పతాకంపై కె.దేవానంద్ నిర్మిస్తున్నారు. ‘పల్లెటూరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా అందరిని ఆకట్టుకుంటుంది.
శరవేగంగా చిత్రాన్ని పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఈజే వేణు, సంగీతం: అబూ, సాహిత్యం: చంద్రబోస్, స్క్రీన్ప్లే, మాటలు: కల్యాణ్ శ్రీ వర్మ, దర్శకత్వం: రుద్ర.