జెర్సీ, సీతారామం సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఈ చిత్రంలో ప్రిన్సెస్ నూర్జహాన్పాత్రకు ప్రాణం పోసింది మృణాళ్ ఠాకూర్. మరికొన్ని రోజుల్లో 2022 ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తనకెంత ప్రత్యేకమైనదో చెప్పుకొచ్చింది.
నాకు 2022 (2022 year) అద్భుతమైన సంవత్సరం. ఈ ఏడాది నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. వచ్చే ఏడాదికి కొన్ని అద్భుతమైన సినిమాలున్నాయి. ప్రస్తుతం నేను ‘పిప్పా’ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నా. పిప్పాతో అసోసియేట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు సంతృప్తికరమైన సంవత్సరం. నాకు అభిమానుల నుంచి లభిస్తున్న ప్రేమ అనుభూతిని ప్రస్తుతం ఆస్వాదిస్తున్నా. భిన్నమైన సినిమాలు చేయడం వల్లే ఓ యాక్టర్గా నేను ఇంతగా ఎదిగానని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ పూజ మేరీ జాన్, ఆంఖ్ మిచోలి, గుమ్రా చిత్రాల్లో నటిస్తోంది. సీతారామం సినిమాతో ఫుల్ జోష్ మీదున్న మృణాళ్ ఠాకూర్ మరో హిట్టు కొట్టేందుకు ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తోంది.