Mrunal Thakur | తెలుగులో తన అరంగేట్ర చిత్రం ‘సీతారామం’ ఎన్నో గొప్ప జ్ఞాపకాలను మిగిల్చిందని, ఆ సినిమాలోని సహ నటులు దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్న ద్వారా కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పింది కథానాయిక మృణాల్ ఠాకూర్. మరాఠీ, హిందీ చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపుకు నోచుకొని ఈ భామ ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా అగ్ర నాయికల జాబితాలోకి చేరింది.
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో ఈ అమ్మడికి భారీ అవకాశాలొస్తున్నాయి. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమా సంగతులను పంచుకుంది. ‘రష్మిక మందన్న ఎనర్జీని చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఎన్ని గంటలు పనిచేసినా ఆమెలో అలసట కనిపించదు. ఇక పాత్రల ఎంపికలో ఆమె చాలా ప్రత్యేకం.
‘సీతారామం’లో అఫ్రిన్ వంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ పాత్రను ఆమె తప్ప మరెవరూ చేయలేరు’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ…ఏ భాషలో మంచి పాత్ర దొరికినా వెంటనే ఒప్పుకోవడం సినిమా పట్ల ఆయనకున్న పాషన్కు నిదర్శనమని, ఏ జోనర్ చిత్రంలోనైనా ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని పేర్కొంది. కెరీర్పరంగా తాను వారిద్దరిని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలను ఎంపిక చేసుకుంటున్నానని మృణాల్ ఠాకూర్ చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’చిత్రంలో నటిస్తున్నది. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదలకానుంది.