నదీయాస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏ.ఏమ్ ఫెరోజ్ నిర్మిస్తున్న నూతన చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘శంభో శంకర’ ఫేమ్ ఎన్ శ్రీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే రోజా సెల్వమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత మాట్లాడుతూ ‘రొటీన్కు భిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రముఖనాయకానాయికలు ఈ సినిమాలో నటించబోతున్నారు. ‘శంభో శంకర’ చిత్రంతో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్న శ్రీధర్ వినూత్నమైన పాయింట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్పైకి తీసుకొస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్రీసాయి.