రాకేష్ వర్రే కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’. విరించివర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల కొత్త పోస్టర్ను విడుదల చేశారు. “బాహుబలి, ఎవ్వరికీ చెప్పొద్దు వంటి సినిమాల ద్వారా రాకేష్ వర్రే ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ఈ సినిమాలో ఆయన పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తారు.
అసాంఘిక శక్తులపై అతని పోరాటం ఏమిటన్నది తెరపై చూడాల్సిందే. దర్శకుడు దాదాపు ఆరు నెలల పాటు ఆడిషన్స్ నిర్వహించి చివరకు హీరోగా రాకేష్ వర్రేను ఎంపిక చేశారు. ఆయనకు గుర్తింపు తెచ్చే చిత్రమవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: గోపీసుందర్, దర్శకత్వం: విరించివర్మ.