Aadu Jeevitham | సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న తాజా చిత్రం “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహిస్తుండగా.. అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అకాడమీ అవార్డు విజేత ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో కొచ్చిలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించారు మేకర్స్. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలయాళ స్టార్ మోహన్ లాల్ వచ్చాడు. అయితే ఈ వేడుకలో మోహన్ లాల్ మాట్లాడుతూ.. ఏఆర్.రెహమాన్పై ప్రశంసలు కురిపించాడు.
రెహమాన్ గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయడం అక్కర్లేదు. నేను ఒక నటుడిగా గుర్తింపు సాధించిన ‘ఇరువర్’ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు. ఇందులోని పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. యోధ సినిమా వచ్చి 30 ఏండ్లు అవుతున్నా అందులోని పాటలు వింటుంటే ఇప్పటికి రెహమాన్ గుర్తుకువస్తాడు. ఇక ఈ సినిమా కాకుండా మేమిద్దరం కలిసి ‘ఆరాట్టు’ సినిమాలో కలిసి నటించాము. ఈ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడ్డాను. రెహమాన్ మలయాళ సినిమాకు సంగీతం అందించినందుకు కృతజ్ఞతలు. నేను కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తుల్లో రెహమాన్ ఒకరు. అతని తండ్రి కే.శేఖర్ కూడా మలయాళంలో 23 సినిమాలకు పైగా కంపోజర్గా పనిచేశారు. దాదాపు 500 పైగా సినిమాలకు సంగీతం అందించాడు అంటూ మోహన్ లాల్ వెల్లడించాడు.
Mohanlal sir about @arrahman sir at the #Aadujeevitham audio launch pic.twitter.com/1uTkw0A85B
— A.R.Rahman Vibes (@ARRvibes) March 17, 2024
ఇక “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా కథ విషయానికి వస్తే.. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. ఇక ఈ సినిమా పూర్తిగా ఎడారిలో తెరకెక్కిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సాధించింది. ప్రముఖ రచయిత బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమా వస్తుండగా.. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.