Mohan Lal | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊబకాయంపై పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 24, 2025న మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా.. ఊబకాయం సమస్యను ప్రస్తావించి, దీన్ని ఎదుర్కోవడానికి తక్కువ నూనె వాడాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా, మోహన్లాల్తో సహా 10 మంది ప్రముఖులను ఈ ఉద్యమంలో భాగం కావాల్సిందిగా నామినేట్ చేశారు. అయితే ప్రధాని మోదీ తనను నామినేట్ చేయడంపై తాజాగా స్పందించారు మోహన్ లాల్.
ఊబకాయం సమస్యపై పోరాటానికి నాయకత్వం వహిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఇలాంటి ఆలోచనలతోనే ఆరోగ్యకరమైన భారతదేశాన్ని రూపొందించగలం. అధిక నూనె వినియోగాన్ని తగ్గించడం వలన ఊబకాయం నుంచి బయటపడడంతో పాటు సరైన దిశగా ఒక అడుగు ముందుకు వేయవచ్చు. ఈ మిషన్లో చేతులు కలిపేందుకు నేనూ 10 మందిని నామినేట్ చేస్తున్నా. అంటూ అగ్ర నటుడు చిరంజీవితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, దుల్కర్ సల్మాన్, ఉన్ని ముకుందన్, దర్శకుడు ప్రియ దర్శన్, టోవినో థామస్, మేయర్ రవి, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్లను నామినేట్ చేశాడు మోహన్ లాల్.
Thank you, Hon. PM @narendramodi Ji, for spearheading this vital movement to #FightObesity and for the nomination. A healthier India begins with mindful choices, and reducing excess edible oil consumption is a meaningful step in the right direction.
I am honored to pass this on… https://t.co/7TmhzdcoQq
— Mohanlal (@Mohanlal) February 24, 2025
ఇండియాలో ఊబకాయం (Obesity) గత కొన్ని దశాబ్దాలుగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా మారింది. ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాల సమస్యగా భావించిన ఈ వ్యాధి, ఇప్పుడు భారతదేశంలో కూడా విస్తృతంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, శారీరక శ్రమ తగ్గడం అలాగే పట్టణీకరణ. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5, 2019-21) ప్రకారం, భారతదేశంలో 18-69 సంవత్సరాల వయస్సు గల పురుషులలో 22.9% మరియు మహిళలలో 24% మంది ఊబకాయం లేదా అధిక బరువుతో ఉన్నారు. ఊబకాయం వల్ల మధుమేహం (టైప్-2 డయాబెటిస్), గుండె జబ్బులు, రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఆస్టియోఆర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ.