వెండితెరపై అలరించిన బాలకృష్ణ(Bala Krishna) ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆహా కోసం అన్స్టాపబుల్ అనే షోని బాలకృష్ణ హోస్ట్ చేయనుండగా, ఈ కార్యక్రమం నవంబర్ 4 నుండి ప్రసారం కానుంది. అయితే ఈ షోకి వచ్చే తొలి గెస్ట్ ఎవరని కొద్ది రోజులుగా పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
ఆహా అన్ స్టాపబుల్ సెట్ లో బాలయ్యతో కలిసి మోహన్ బాబు(Mohan Babu) ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో మోహన్ బాబుతో బాలకృష్ణ సందడి చేయనున్నట్టు సమాచారం. మరో రెండు మూడు రోజులలో టీజర్ విడుదల చేసి అఫీషియల్గా ప్రకటించనున్నారని తెలుస్తుంది. అయితే బాలకృష్ణ, మోహన్ బాబులు ఇద్దరు ఇలాంటి టాక్ షోల్లో కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
ఇప్పుడు కలిసి పలు విషయాలు షేర్ చేసుకోబోతున్న నేపథ్యంలో ఈ షో మరింత ఆసక్తికరంగా మారబోతుంది. వీరిద్దరి కాంబో టాక్ షో ఎలా ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు. ఇద్దరు టాలీవుడ్ బిగ్ స్టార్స్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఆహా అన్నట్లుగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని విశ్లేషకులు అంటున్నారు. అన్ స్టాపబుల్ టాక్ షో ను బాలయ్య ఛారిటీ కోసం చేస్తున్నాడని, తనకు వచ్చే రెమ్యునరేషన్ని ఛారిటీకి ఇస్తాడని టాక్.