ఆస్కార్ విజయంతో భారతదేశ కీర్తిని విశ్వవేదిక మీద ఘనంగా చాటారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. తాజాగా ఆయన ఒకనాటి సంచలన చిత్రం ‘జెంటిల్మేన్’కు సీక్వెల్గా రూపొందనున్న ‘జెంటిల్మేన్-2’కు స్వరాల్ని అందించబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో కె.టి.కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్మేన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ద్వారా నిర్మాత కె.టి.కుంజుమోన్ ఇండస్ట్రీలోకి పునరాగమనం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.