అర్జున్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్మెన్’ (1993) చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. చక్కటి సామాజిక సందేశంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్గా తెరకెక్కిస్తున్న ‘జెంటిల్మెన్-2’ చిత్రం శనివారం చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కె.టి.కుంజుమోన్ నిర్మిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో దక్షిణాది పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతాన్నందిస్తున్న ఎం.ఎం.కీరవాణిని చిత్ర బృందం ఘనంగా సన్మానించింది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.