Mithun Chakraborty | బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి ఆసుపత్రిలో చేరారు. గుండె నొప్పితో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు మిథున్ చక్రవర్తికి ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఇక మిథున్ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మిథున్ చక్రవర్తికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ 2024 అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ బాలీవుడ్తో పాటు ఇండియన్ సినిమాకు చేసిన సేవలకుగాను ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది.