Mission Raniganj | ఓ మై గాడ్ చిత్రంతో బాలీవుడ్లో చాలా రోజులకు హిట్ కొట్టాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshya Kumar). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిషన్ రాణిగంజ్. ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉప శీర్షిక. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా కథానాయికగా నటిస్తుంది. 1989లో రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో జరిగిన ప్రమాదంపై ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ ప్రమాదంలో జస్వంత్ సింగ్ గిల్ (Jaswanth Singh gill) అనే మైనింగ్ ఇంజనీర్ మైనింగ్లో చిక్కుకున్న 64 మందిని కాపాడారు. అతని జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇక కేసరి వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత అక్షయ్, పరిణీతి మళ్లీ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రానికి టిను సురేష్ దేశాయ్ (Tinu Suresh Deshayi) దర్శకత్వం వహిస్తుండగా.. పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వశ్ భగ్నానీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తికాగా.. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ గమనిస్తే.. మైనింగ్లో చిక్కుకున్నట్లు ఉన్న కార్మికులను కాపాడే వ్యక్తిగా అక్షయ్ కుమార్ లుక్ ఉంది. ఇక ఈ సినిమా టైటిల్ను మారుస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ అని ఉన్న ఈ మూవీ టైటిల్ను “మిషన్ రాణిగంజ్” (Mission Raniganj) ది గ్రేట్ భారత్ రెస్క్యూ గా పేరు మార్చినట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమా టీజర్ను అక్షయ్ కుమార్ బర్త్ డే పుట్టినరోజు కానుకగా (సెప్టెంబర్ 09) విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను అక్టోబర్ 06న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Heroes don’t wait for medals to do what’s right!
Watch the story of Bharat’s true hero with #MissionRaniganj in cinemas on 6th October.
Teaser out tomorrow! pic.twitter.com/1o9dMgf3EY— Akshay Kumar (@akshaykumar) September 6, 2023
ఇక ఈ చిత్రంలో అక్షయ్, పరిణీతితో పాటు, రాజేష్ శర్మ, రవి కిషన్, గౌరవ్ ప్రతీక్, అనంత్ మహదేవన్ దిబ్యేందు భట్టాచార్య కీలక పత్రాలు పోషిస్తున్నారు.