హైదరాబాద్ : సూపర్స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేశ్బాబును సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ పరామర్శించారు. ఇందిరాదేవి చిత్రపటానికి మంత్రి తలసాని పుష్పాంజలి ఘటించారు. మహేశ్బాబు మాతృమూర్తి ఇందిరా దేవి నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి.. నిన్న తెల్లవారుజామున ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.