ఫిల్మ్హబ్గా హైదరాబాద్ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. మంగళవారం బీఆర్కేభవన్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో కలిసి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడం వల్ల సినిమా పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మంత్రికి వివరించారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూసివేసినందున విద్యుత్ చార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అలాగే 5వ ఆట ప్రదర్శన, ఆన్లైన్ టికెటింగ్ తదితర సమస్యలపై కూడ ఈ సందర్భంగా చర్చించారు. గతంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తమకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీలలో మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర రంగ అభివృద్దికి అనేక విధాల సహాయ సహకారాలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా అనువుగా ఉన్న హైదరాబాద్ ను ఫిల్మ్హబ్ గా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. సినిమా షూటింగ్ల కోసం అనుమతులు పొందేందుకు నిర్వాహకులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో షూటింగ్లకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఐదు షోలకు అనుమతి
అదేవిధంగా టికెట్ల విక్రయాలలో పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనివలన తకువ సర్వీస్ చార్జీ తోనే ప్రేక్షకులు టికెట్ ను పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రైవేట్ సైట్లు ఒకో టికెట్ కు 20 నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయని, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్లైన్ టికెట్ విధానంలో ఒకో టికెట్కు కేవలం ఆరు రూపాయలు మాత్రమే సర్వీస్ ఛార్జీ వసూలు చేయబడుతుందని మంత్రి వివరించారు. ఆన్లైన్ టికెట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని హోం, లా సెక్రెటరీలను మంత్రి ఆదేశించారు. లాక్డౌన్ సమయంలో థియేటర్ లు మూసివేసి ఉన్నందున ప్రభుత్వానికి చెల్లించాల్సిన విద్యుత్ ఛార్జీలు, ఆస్తిపన్ను రద్దు చేసి ఆదుకోవాలని, సింగిల్ స్రీన్ థియేటర్లలో వాహనాల పారింగ్ ఫీజు వసూలు చేసేందుకు అనుమతించాలని తదితర విజ్ఞప్తులతో సినీ ఎగ్జిబిటర్స్ వినతిపత్రాన్ని అందజేశారని, అందులో పారింగ్ ఫీజు వసూలుకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.
మిగిలిన అంశాల పరిషారానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ప్రస్తుతం 4 షో లు ప్రదర్శించబడుతున్నాయని, 5 వ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల లోని కార్మికుల (24 క్రాఫ్ట్స్) కు అండగా ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. లాక్డౌన్ కారణంగా మూతపడిన థియేటర్ లను 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో తెరిచేందుకు ప్రభుత్వం నవంబర్ 2020 అనుమతులు ఇచ్చిందని, కరోనా తగ్గుముఖం పట్టడంతో 100 శాతం సీటింగ్ కెపాసిటీ తో తెరిచేందుకు ఫిబ్రవరి 2021 న ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.