‘ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ కొందరి చేతుల్లో ఉందనే భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త వాళ్లు వచ్చి మంచి విజయాలు సాధిస్తున్నారు’ అని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ‘సీతారామపురంలో ఓ ప్రేమజంట’ చిత్ర టీజర్ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.
రణధీర్, నందినిరెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎమ్.వినయ్ బాబు దర్శకత్వం వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం తెలంగాణ భాష, యాసలో వచ్చే చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతున్నది. ఈ కోవలోనే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రమిదని నిర్మాత బీసు చందర్గౌడ్ తెలిపారు.