‘మైఖేల్’ యూనిక్ స్టోరి. చాలా కొత్త నెరేటివ్ స్టయిల్లో ఉంటుంది.యాక్షన్తో పాటు ఎమోషన్స్ బలంగా ఉంటాయి. ఈ సినిమాలో అందరూ బ్యాడ్బాయ్స్, బ్యాడ్పీపుల్స్. వీరి మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఇందులో డార్క్ కామెడీ ఉంటుంది’ అన్నారు యువ కథానాయకుడు సందీప్ కిషన్. ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. విజయ్సేతుపతి, వరలక్ష్మీ శరత్కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్సందేశ్, గౌతమ్మీనన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. భరత్చౌదరి, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నారాయణ దాస్ కె.నారంగ్ సమర్పకులు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ విలేఖరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఊహించిన దాని కంటే గొప్పగా వుంటుంది
“మైఖేల్’ కథకి, విజువల్ నెరేటివ్కి, సినిమాకి పాన్ ఇండియా కెపాసిటీ వుంది. విజువల్స్ చాలా గొప్పగా ఉంటాయి. రియలిస్టిక్ వైబ్తో కొనసాగే గ్యాంగ్స్టార్ స్టోరీ ఇది. మైఖేల్ పాత్ర చాలా వైల్డ్. గ్యాంగ్స్టర్ కాకపోయినా ఎగ్రెసివ్గా ఉంటాడు. అతనికి ఫ్రెండ్స్ ఉండరు. ఎవరితో మాట్లాడడు. తను చేసే పనులన్నీ అనూహ్యంగా అనిపిస్తాయి. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. గ్యాంగ్స్టర్ ప్రపంచంలో సెట్ చేసిన ఎమోషనల్ డ్రామా ఇది. కథనం చాలా కొత్తగా వుంటుంది. మనం ఊహించిన దాని కంటే చాలా బెటర్గా ఉంటుంది. దర్శకుడు రంజిత్ మేము అనుకున్న దాని కంటే గొప్ప సినిమా తీశాడు. మైఖేల్ విజువల్ గ్రాండియర్తో ఆకట్టుకుంటుంది.
కుడికాలు పనిచేయలేదు
ఈ చిత్రం కోసం కొన్ని సన్నివేశాల్లో నటించడానికి వాటర్ తప్పితే ఏమీ తీసుకోలేదు. దాదాపు 18 రోజుల పాటు ఆ డైట్లో ఉన్నాను. ఒక దశలో కుడికాలు పనిచేయడం మానేసింది. ఈ చిత్రం కోసం అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో నాని చెప్పినట్లు ఈ సినిమాతో నాకు అదృష్టం కలిసొస్తుందని నమ్ముతున్నాను. నేను ప్రస్తుతం నటిస్తున్న భైరవకోన, బడ్డీ, కెప్టెన్ మిల్లర్ సినిమాలు చిత్రీకరణ దశలో వున్నాయి. దీనితో పాటు ఫ్యామిలీ మ్యాన్ -3 వెబ్ సిరీస్ వుంది. అలాగే త్వరలో మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాబోతుంది.