సందీప్కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకొడి దర్శకుడు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలిపాట ‘నువ్వుంటే చాలు’ ఈ నెల 28న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
‘చక్కటి ప్రేమగీతమిది. సామ్ సీఎస్ మెలోడీ ప్రధానంగా స్వరాల్ని అందించారు. సరికొత్త ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది.