బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మియో చక్రవర్తి ‘నేనెక్కడున్నా’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచమమవుతున్నాడు. ఈ చిత్రానికి మాధవ్ కోదాడ దర్శకుడు. మారుతి శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా టీజర్, పోస్టర్ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో రూపొందిస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఓ వ్యక్తి రాజకీయాల్ని ఎలా శాసించాడన్నది ఆసక్తిని పంచుతుంది’ అని చెప్పారు. ‘ముంబయి, హైదరాబాద్లలో షూటింగ్ చేశాం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని నిర్మాత తెలిపారు. మురళీశర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, షాయాజీషిండే, అభిమన్యుసింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయపాల్ నిమ్మల, సంగీతం: శేఖర్ చంద్ర, బ్యాక్గ్రౌండ్ స్కోర్: రాజేష్ ఎస్ఎస్, కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం: మాధవ్ కోదాడ.