తెలంగాణ గ్రామీణ నేపథ్య కథతో రూపొందిస్తున్న యూత్ఫుల్ చిత్రం ‘మేమ్ ఫేమస్’. స్వీయ దర్శకత్వంలో సుమంత్ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఛాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ పతాకాలపై శరత్చంద్ర, అనురాగ్రెడ్డి, చంద్రు మనోహర్ నిర్మించారు. ఈ సినిమాలో 35 మంది నూతన తారాగణం నటించారు. ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం సినిమా టీజర్, పాటల్ని ప్రదర్శించారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు, హీరో సుమంత్ప్రభాస్ మాట్లాడుతూ ‘తెలంగాణ పల్లెటూరిలో నడిచే కథ ఇది. అక్కడి యువకుల బృందం ఓ లక్ష్యం కోసం ఏం చేశారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమ, వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. కథానుగుణంగా ముప్పై మంది కొత్తవారిని తీసుకున్నాం. ఈ సినిమా మొత్తం తెలంగాణ మటన్ దావత్లా ప్రేక్షకుల్లో జోష్ను నింపుతుంది’ అన్నారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మస్తు మజా చేస్తారని, భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు.